
- ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల
అమరావతి, ముద్ర: ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ రాష్ట్రంలో అన్ని పార్టీలు దూకుడు పెంచాయి. వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీల ప్రచారం ప్రజల్లోకి దూసుకెళ్తున్నాయి. ఇప్పటికే దాదాపు అభ్యర్థులను కూడా ప్రకటించారు. తాజాగా ఎన్నికల ప్రచార బరిలోకి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల దిగుతున్నారు. ఈ కోరనే గురువారం తల్లి ఆశీర్వాదం తీసుకున్నారు. ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్నట్లు స్వయంగా షర్మిల ప్రకటన. ఈ మేరకు సోషల్ మీడియా(ఎక్స్) వేదికగా భావోద్వేగ పోస్ట్ పెట్టారు. ‘దేవుడి దీవెనలతో, నాన్న ఆశీర్వాదంతో, అమ్మ ప్రేమతో, చిన్నన్న చివరి కోరిక ప్రకారం ఎన్నికల ప్రచారానికి బయలుదేరుతున్నాను.. మీ రాజన్న బిడ్డను దీవించాలని, ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం ఎన్నికల శంఖారావం పూరించనున్నాను. న్యాయం కోసం పోరాడుతున్న ఈ యుద్ధంలో మీ ఆశీస్సులు నాపై ఉంటాయని ఆశిస్తున్నాను’ అని ట్వీట్లో పేర్కొన్నారు.