- శ్రీకాళహస్తిలో ఉద్రికత్త
శ్రీకాళహస్తి, ముద్ర: టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డిపై వైసీపీ కార్యకర్త దాడికి యత్నించడంతో శ్రీకాళహస్తిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రచారం చేసే సమయంలో సెల్ఫీ వీడియో తీసుకున్నానని ఓ వ్యక్తి రాగా, అతని జేబులో కత్తిని పేర్కొన్న సుధీర్ అనుచరులు. కత్తితో దాడికి దిగక ముందే టీడీపీ శ్రేణులు అతన్ని అడ్డుకున్నారు. దాడికి యత్నించిన మునికుమార్ వైసీపీ కార్యకర్తగా పేర్కొన్నారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఎన్నికల్లో టీడీపీని ఎదుర్కొనే దమ్ము లేక వైసీపీ ఇలా దాడులకు పాల్పడుతోందని టీడీపీ శ్రేణులు విమర్శిస్తున్నారు. శ్రీకాళహస్తి అసెంబ్లీ బరిలో వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి బరిలో ఉన్నారు. టీడీపీ నుంచి బొజ్జ సుధీర్ రెడ్డి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఇద్దరి మధ్య గట్టి పోటీ. గత ఎన్నికలలో ఈసారి ఎక్కువ మెజారిటీ సాధించాలని మధుసూదన్ రెడ్డి ఊహించినట్లుగా, ఈసారి ఎలాగైనా శ్రీకాళహస్తిలో తమ జెండా ఎగురవేయాలని టీడీపీ భావిస్తోంది.