
ముద్ర,తెలంగాణ:-నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి సంబంధించిన మాల్ కేసు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల మాల్ను ఆర్టీసీ అధికారులు సీజ్ స్టేషన్ చేసిన విషయం తెలిసిందే.. అయితే.. ఆర్మూరు బస్ సమీపంలో ఉన్న జీవన్ రెడ్డి మాల్ అండ్ మల్టీప్లెక్స్ వ్యవహారంలో హైకోర్టు గురువారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. TGSRTC కి పెండింగ్లో ఉన్న రూ.2.51 కోట్ల అద్దె బకాయిలను వారం రోజుల్లో చెల్లించాలని విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ను విడుదల చేసింది. ఆర్డర్ జారీ చేసిన రోజు నుంచి వారంలోగా అద్దె బకాయిలు చెల్లించాలంటే నిబంధనల ప్రకారం జీవన్ రెడ్డి మాల్ మల్టీప్లెక్స్ భవనాన్ని తిరిగి టీజీఎస్ఆర్టీసీ స్వాధీనం చేసుకోవాలని సూచించింది.
భవిష్యత్ లోనూ అద్దె సమయంలో చెల్లించకుంటే ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా మాల్ ను స్వాధీనం చేసుకోవచ్చని స్పష్టం చేసింది. విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన ఆ షాపింగ్ మాల్లోని సబ్ లీజ్దారుల ప్రయోజనం దృష్ట్యా మాల్ను ఓపెన్కి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు ప్రకారం సబ్ లీజ్దారులను దృష్టిలో ఉంచుకుని జీవన్ రెడ్డి మాల్ అండ్ మల్టీప్లెక్స్ ను తెరిచేందుకు శుక్రవారం సంస్థ అనుమతి ఇచ్చింది. వారం రోజుల్లో అద్దె బకాయిలు చెల్లించాలంటే హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం సంస్థ నడుచుకుంటుందని సజ్జనార్ ట్విట్ చేశారు.
నిజామాబాద్ జిల్లా ఆర్మూరు బస్ స్టేషన్ సమీపంలో ఉన్న జీవన్ రెడ్డి మాల్ అండ్ మల్టీప్లెక్స్ వ్యవహారంలో హైకోర్టు గురువారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. #TGSRTC కి పెండింగ్లో ఉన్న రూ.2.51 కోట్ల అద్దె బకాయిలను వారం రోజుల్లోగా చెల్లించాలని విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్… pic.twitter.com/8kkjOYfXYb
— VC సజ్జనార్ – MD TGSRTC (@tgsrtcmdoffice) మే 25, 2024