Friday, October 18, 2024
Home » గిరిజన తండాలపై ఎక్సైజ్ దాడులు సరికాదు – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

గిరిజన తండాలపై ఎక్సైజ్ దాడులు సరికాదు – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
 గిరిజన తండాలపై ఎక్సైజ్ దాడులు సరికాదు - తాజా తెలుగు వార్తలు |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్


  • గిరిజన కుటుంబాలకు ఉపాధి కల్పించాలి
  • ఇంటి తాళాలు పగులగొట్టి దాడులు చేస్తున్న ఎక్సైజ్ అధికారులు
  • తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి బాల్య నాయక్

ముద్ర,పానుగల్: గుడుంబా తయారు చేసిన తాండాలలో గిరిజన కుటుంబాలను వేధించడం సరికాదని ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి బాల్య నాయక్ అన్నారు. శుక్రవారం పానుగల్ మండల పరిధిలోని తెల్లరాళ్లపల్లి తండాలో ఎక్సైజ్ అధికారులు గూడుంబా తయారు చేసిన గిరిజన కుటుంబాల ఇళ్లపై దాడులు నిర్వహిస్తున్నారని, ఇంటికి తాళాలు ఉన్న పగలగొట్టి దాడులు చేయడం సరికాదని అన్నారు. తాండాలలో గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం ఉపాధి అవకాశాలను కల్పించాలని. జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాలకు కుమారులు వలస వెళ్లడంతో ఇండ్ల దగ్గరనే ఉంటున్న వృద్ధులు తాగడానికి ఒక సీసా పెట్టి తాగుతున్నారు తప్ప అమ్మకు కాదన్నారు.

గిరిజన తాండాలలో చాలా వరకు గిరిజన కుటుంబాలు సారా తయారీని మానుకున్నారని అన్నారు.వికలాంగుడు అయిన నాయక్ ఇంటికి వెల్లి యజమాని అనుమతి లేకుండానే ఇంటి తాళాలను పగలగొట్టి ఇంట్లో వున్న వస్తువులను చిందర వందర చేసి ఆయన అన్నారు. గిరిజనులపై ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు నిర్వహించడం సరైన విధానం కాదని ఉమ్మడి పాలమూరు జిల్లాలో గిరిజన తండా అయిన తెల్లరాళ్లపల్లి తండాలో 70 శాతం మంది గిరిజనులు బ్రతుకుతెరువు లేక వలస వెళ్లారని, ఏ ఇంటికి వెళ్లిన తాళాలు ఉంటాయని ఆయన అన్నారు. గిరిజన కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తే సంపూర్ణంగా సారా తయారిని అరికట్టవచ్చు అని అన్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch