Thursday, March 20, 2025
Home » పిల్లలమర్రిలో ఘనంగా లక్ష మల్లె పుష్పార్చన – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

పిల్లలమర్రిలో ఘనంగా లక్ష మల్లె పుష్పార్చన – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
 పిల్లలమర్రిలో ఘనంగా లక్ష మల్లె పుష్పార్చన - Latest Telugu News |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



  • భక్తులతో కిట కిటలాడిన ఆలయ ప్రాంగణం
  • ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు దరూరి రాఘవా చార్యులు

సూర్యాపేట ముద్ర ప్రతినిధి:-సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని పిల్లలమర్రి శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో గురువారం వైభవంగా హనుమాన్ జయంతి త్రయానిక ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఆలయ అర్చకులు దరూరి వెంకట రాఘవా చార్యులు ఆంజనేయ స్వామికి లక్ష మల్లె పుష్పార్చన ఘనంగా నిర్వహించారు.మల్లెల అలంకరణలో స్వామి వారికి భక్తులకు దర్శనం కల్పించారు.ఆలయ ధర్మకర్త గవ్వ కృష్ణ రెడ్డి మాట్లాడుతూ చరిత్రాత్మక దేవాలయాలు మన పిల్లలమర్రి లో మన గ్రామానికి ఎంతో విశేషమని అతి పురాతన శ్రీ అభయాంజనేయ ఆలయంలో ఘనంగా ఎటువంటి కార్యక్రమాలు జరగలేదు. రక్షణార్ధం జరపటం ఎంతో పుణ్యం అని తెలియజేసింది.

లక్ష మల్లె పుష్పార్చన దాతలు బ్రహ్మ దేవర సీతయ్య కళావతి దంపతులు సహకరించారని వారికి ఆ స్వామి వారి అనుగ్రహం ఉండాలని తెలియజేసారు.భక్తులు రామ నామ స్మరణ చేస్తూ స్వామిని దర్శించుకున్నారు.ఈ కార్యక్రమంలో దరూరి సింగార చార్యులు,చింతాడ రామానుజ చార్యులు, ముడుంభై రఘువరన్ ఆచార్యులు, అబ్బూరి వినోద్ శ్యామలశం, షే. సరస్వతి,దేవరశెట్టి ముకుందం,మనసాని నాగేశ్వరరావు,మహిళ భక్తులు ముడుంభై సారిక, గవ్వ పద్మ,మెరెడ్డి సువర్ణ,దేవరశెట్టి అనసూర్య,మేరెడ్డి సునంద,మల్లీశ్వరి,రేణుక కొనసాగుతున్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch