
- జాతీయ పతాకాన్నిఆవిష్కరించిన సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి, ఐపీఎస్.
ముద్ర, షాద్ నగర్:సైబరాబాద్ పోలీసు కమీషనరేట్ ప్రాంగణంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ముఖ్యఅతిథిగా హాజరైన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి జాతీయ జెండాను ఆవిష్కరిం చారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ… ముందుగా అందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. 2014, జూన్ 2న, అధికారికంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం నేటితో పదేళ్లు పూర్తి చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాది నిర్మాణంలో పోలీస్ శాఖ సిబ్బంది మనస్ఫూర్తిగా కర్తవ్య నిర్వహణను ఆయన చేసారు.
సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి, ఐపీఎస్., సైబరాబాద్ జైంట్ సీపీ ట్రాఫిక్ డి. జోయెల్ డేవీస్, ఐపీఎస్., మాదాపూర్ డీసీపీ డా. జి. వినీత్, ఐపీఎస్., శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి, ఐపీఎస్., బాలానగర్ డీసీపీ శ్రీనివాసరావు, ఐపీఎస్., రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్, ఐపీఎస్., మేడ్చల్ డీసీపీ నితికా పంత్, ఐపీఎస్., సైబరాబాద్ డీసీపీ క్రైమ్స్ నర్సింహా కొత్తపల్లి, డీసీపీ ఈఓడబ్ల్యూ కె. ప్రసాద్, ఉమెన్ & చైల్డ్ సేఫ్టీ డీసీపీ సృజన కర్ణం, ఎస్బీ డీసీపీ సాయి శ్రీ, మేడ్చల్ ట్రాఫిక్ డీసీపీ డీవీ శ్రీనివాసరావు, ఐపీఎస్., లా అండ్ ఆర్డర్ డీసీపీలు, ఏడీసీపీలు, ఏసీపీలు, సీఏవో అడ్మిన్ గీత, సీఏవో అకౌంట్స్ చంద్రకళ, ఇన్స్పెక్టర్లు, ఇతర సిబ్బంది సిబ్బంది.