4

ముద్ర,తెలంగాణ:– ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి జ్యుడీషియాల్ కస్టోడీ పొడిగించింది. తీహార్లో కవిత జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో ఇవాళ ఈడీ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. అయితే కవిత జ్యుడీషియల్ కస్టడీని జులై 3వ తేదీ వరకు పొడిగిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది.తదుపరి విచారణ జులై 3కు వాయిదా వేసింది. మే 10వ తేదీన ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్ ను పరిగణలోకి తీసుకున్న కోర్టు కవితను సమన్లు జారీ చేస్తూ మీపై అభియోగాలు మోపబడ్డాయి. ఈ కేసుపై ట్రయల్ ప్రారంభం కావాల్సి ఉంది కాబట్టి జైల్లో ఉండాల్సి ఉంది. మరోవైపు సీబీఐ కేసులో కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపుపై ఇవాళ మధ్యాహ్నం 2గంటలకు కోర్టులో విచారణ జరగనుంది.