
ముద్ర ప్రతినిధి, నిర్మల్: గతంలో నిర్మల్ కలెక్టర్ గా పని చేసిన ముషారఫ్ ఆలీ ఫారూఖీ కి కోర్టు ధిక్కరణ నేరం క్రింద నెలరోజుల సాధారణ జైలు శిక్ష విధిస్తూ తెలంగాణా హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి మాధవీ దేవి తీర్పు ఇచ్చారు. అలాగే నిర్మల్ మునిసిపల్ కమిషనర్ కు 15 రోజుల సాధారణ జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు.
సయ్యద్ శాఖీర్ అహ్మద్ సహా మరో 43 మంది కలెక్టర్, మునిసిపల్ కమిషనర్లపై కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేశారు. 44 4వ తరగతి ఉద్యోగులకు పని చేసిన కాలానికి సంబంధించిన వేతనాలు మూడు వారాల్లో గతంలో ఉన్న మంది కోర్టులో ఉన్నారు. ఐతే కలెక్టర్, కమిషనర్లు వారు ఆ కాలంలో పని చేయలేదని వేతనాలు ఆపివేశారు. తాము వారి పనిని నిర్ధారించిన అనంతరమే వేతనాలు చెల్లించాలని ఆదేశించినా, కోర్టు ఉత్తర్వులు అమలు చేయనందుకు వారికి ఈ శిక్ష విధించారు.