34

వెలగపూడి : ఐఆర్ఆర్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. ఈ 29కి విచారణను కోర్టు వాయిదా వేసింది. కేసులో ఉత్తర్వులు ఇచ్చే వరకు చంద్రబాబుపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఇసుక పాలసీ కేసులో చంద్రబాబు వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లో సైతం హైకోర్టులో విచారణ 30కి వాయిదా పడింది.