6

ముద్ర,తెలంగాణ:- టీఎస్ టెట్ హాల్ టికెట్లను ఆన్లైన్లో నేటి ఉదయం నుంచి అందుబాటులో ఉంచారు.. అభ్యర్థులు హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎస్సీఈఆర్టీ అధికారులు ఈ నెల 20 నుంచి జూన్ 2 వరకు టెట్ నిర్వహించనున్నారు.తొలిసారిగా ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ పద్ధతి(సీబీటీ)లో ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో పరీక్షలు జరుగుతాయి. ఈఏడాది టెట్ పరీక్షకు 2.86లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, 48,582 మంది సర్వీస్ టీచర్లు కూడా దరఖాస్తులు సమర్పించారు.