ముద్ర.వనపర్తి:- పార్లమెంట్ ఎన్నికల బందోబస్తు విధులు నిర్వహించి తిరిగి పశ్చిమ బెంగాల్కు వెళ్తున్న కేంద్ర సాయుధ బలగాలకు చెందిన అధికారులను వనపర్తి జిల్లా ఎస్పీ రక్షిత మూర్తి బుధవారం రోజున ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేసారు.

ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ స్థానిక పోలీసులతో పాటు కేంద్ర సాయుధబలగాలు సమన్వయం కల్సిడం ద్వారా సంఘటన జరగకుండా పూర్తిస్థాయిలో ప్రశాంతమైన వాతవరణంలో ఎన్నికలు నిర్వహించబడ్డాయని, ఎన్నికల ప్రశాంతంగా నిర్వహించడంలో బందోబస్తు విధులు నిర్వహిస్తున్న ITBP అధికారులు, సిబ్బందికి జిల్లా ఎస్పీ వివరించారు.సత్కారం పొందినవారిలో శ్రీరాములు కుమార్ మండల్, AC/ CCD ITBP , ఇంటిలిజెన్స్, ITBP, PV స్వామి, క్వార్టర్ మాస్టర్ లు ఉన్నారు.ఈ కార్యక్రమములో అడిషనల్ ఎస్పీ ఏ ఆర్ శ్రీ వీరారెడ్డి గారు రిజర్వ్ ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు గారు ఉన్నారు.