10

ముద్ర,సెంట్రల్ డెస్క్:-నేడు కవిత బెయిల్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు విచారణ జరగనుంది. జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ ధర్మాసనం కవిత బెయిల్ పై నిర్ణయం తీసుకోనున్నారు. అనారోగ్య కారణాల వల్ల బెయిల్ ద్వారా కవిత విజ్ఞప్తి చేశారు. PMLA సెక్షన్ 45 ప్రకారం బెయిల్ పొందేందుకు తాను అర్హురాలు అని పిటిషన్లో పేర్కొన్నారు. అయితే, ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వొద్దంటున్నారు ఈడీ, సీబీఐ అధికారులు. ఇప్పటికే ట్రయల్ కోర్టు బెయిల్ నిరాకరించడంతో కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీనికి కవితకు బెయిల్ వస్తుందా? రాదా? అనే ఉత్కంఠ ఏర్పాటు. హైకోర్టులో బెయిల్ రాకపోతే కవిత సుప్రీంకోర్టుకు వెళ్తారని హైకోర్టు. ప్రస్తుతం తిహార్ జైల్లో జ్యూడీషియల్ రిమాండ్లో ఎమ్మెల్సీ కవిత ఉన్నారు.