
ముద్ర,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత కూడా దాడులు ఆగటం లేదు. తాజాగా నేడు తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. చంద్రగిరి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని పై దాడి జరిగింది. పద్మావతి మహిళా యూనివర్సిటీ సమీపంలో వెళుతున్న పులివర్తి నాని వాహనంపై వైసీపీ శ్రేణులు దాడి చేశారు. ఆయన వాహనాన్ని తీవ్రంగా ధ్వంసం చేశారు.
పులివర్తి నాని పై దాడికి పాల్పడుతున్న వైసీపీ శ్రేణులను చెదరగొట్టడం భాగంగా నాని భద్రతా సిబ్బంది రెండు రౌండ్లు గాలిలో కాల్పులు జరిపారు. తనపై దాడి జరగడంతో మహిళా యూనివర్సిటీ రోడ్డుపైనే పులివర్తి నాని బైఠాయించి నిరసన తెలిపారు. పులివర్తి నానిపై దాడి జరగడంతో టిడిపి శ్రేణులు అలర్ట్ అయ్యారు,యూనివర్సిటీ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు.
బ్రేకింగ్ న్యూస్
తిరుపతిలో పద్మావతి యూనివర్సిటీ వద్ద టీడీపీ అభ్యర్థి నాని పై దాడి.. రక్షణగా గన్ మెన్ కాల్పులు. pic.twitter.com/H7qEjCX9cz
— తెలుగు స్క్రైబ్ (@TeluguScribe) మే 14, 2024