4

ముద్ర,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. వివరాల్లోకి వెళితే.. వారంలో పెళ్లి వేడుకలు జరగాల్సిన కుటుంబంలో మృత్యుఘోష వినిపించింది. వివాహ దుస్తుల కోసం హైదరాబాద్ వెళ్లి వస్తుండగా (D) గుత్తిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ ఢీకొట్టడంతో కారులోని కాబోయే పెళ్లి కొడుకు షేక్ సురోజ్(28)తో సహా ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. నలుగురు స్పాట్లో చనిపోగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు మరణించారు. వీరంతా అనంతపురానికి చెందినవారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.