Tuesday, December 9, 2025
Home » ప్రాణం తీసిన ఒక్క రూపాయి.. . – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

ప్రాణం తీసిన ఒక్క రూపాయి.. . – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
 ప్రాణం తీసిన ఒక్క రూపాయి.. .  - తాజా తెలుగు వార్తలు |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర,తెలంగాణ:-వరంగల్ లో దారుణం జరిగింది. ఒక్క రూపాయి విషయంలో ఇద్దరు వ్యక్తుల మధ్య చెలరేగిన చిల్లర ఘర్షణ, ఓ వ్యక్తి నిండు ప్రాణాలను బలి తీసుకుంది. క్షణికావేశంలో మాటామాట పెరిగి తోపులాటకు దారి తీసింది. దీంతో ఓ వ్యక్తి కింద పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

ఈ విషాద సంఘటన వరంగల్ మిల్స్ కాలనీ స్టేషన్ పరిధిలోని గాంధీనగర్‌లో జరిగింది.. ప్రేమ్ సాగర్ అనే వ్యక్తి నడుపుకుంటున్నాడు. శుక్రవారం రాత్రి గాంధీనగర్‌లోని ఓ బిర్యానీ పాయింట్ వద్దకు బిర్యాని కోసం వచ్చాడు. అదే సమయంలో అరవింద్ అనే యువకుడు కూడా బిర్యాని కోసం అక్కడకు వచ్చాడు. ఆటో డ్రైవర్ ప్రేమ్ సాగర్ 59 రూపాయల బిర్యానికి, 60 రూపాయలు ఫోన్ పే కొట్టాడు. ఈ ఒక్క రూపాయి ఎక్కువ కొట్టావ్ అంటూ అరవింద్ ఆటో డ్రైవర్‌ను ఎగతాళి చేశాడు. ఈ విధంగా మధ్య మాటామాట పెరిగి ఇద్దరి వాగ్వివాదానికి దారి తీసింది.ఇది కాస్త ఇద్దరి మధ్య వివాదంగా మారి అరవింద్, ప్రేమ సాగర్‌ను తొయ్యడంతో ప్రేమ రాయి మీద పడి మెదడులో రక్తం గడ్డ కట్టి చనిపోయాడు

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch