
ముద్ర,ఆంధ్రప్రదేశ్:-మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. మూడు కేసుల్లో మధ్యతర ముందస్తు బెయిల్ ను హైకోర్టు ఇచ్చింది. కౌంటింగ్ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈవీఎం ధ్వంసం కేసులో ఇచ్చిన బెయిల్ షరతులే వర్తిస్తుందని కోర్టు. కౌంటింగ్ ప్రక్రియలో పిన్నెల్లి పాల్గొనవచ్చునని హైకోర్టు అనుమతి ఇచ్చింది.
ఎన్నికల పోలింగ్ సమయంలో పాల్వాయిగేటు పోలింగ్ వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. పిన్నెల్లిపై ఈవీఎం ధ్వంసాన్ని అడ్డుకోబోయిన టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావుపై దాడి కేసు, పోలింగ్ బూత్ వద్ద మహిళపై దుర్మార్గపు కేసు, కారంపూడిలో సీఐపై దాడి చేసిన కేసులు నమోదయ్యాయి. ఈ మూడు కేసుల్లో బెయిల్ చేయాలని కోరుతూ పిన్నె హైకోర్టుకు వెళ్లారు. మూడు పిటీషన్ల పై విచారణ జరిపిన హైకోర్టు తీర్పు రిజర్వు చేసింది. సోమవారం ఇరువర్గాల వాదనలు విన్నకోర్టు మంగళవారం తీర్పును. మూడు కేసుల్లో పిన్నెల్లికి షరతులతో కూడిన బెయిల్ ఇవ్వడంతో కోర్టు తీర్పునిచ్చింది.