- 2,22,170 ఓట్ల మెజార్టీ సాధించిన కాంగ్రెస్
ముద్ర ప్రతినిధి భువనగిరి: భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ 2 22 వేల 170 ఓట్లతో భారీ విజయాన్ని కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి కైవసం చేసుకున్నారు. మొదటి రౌండ్ నుండి 23 రౌండ్ల వరకు కాంగ్రెస్ పార్టీ తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది. బ్యాలెట్ ఓట్లతో కలిపి కాంగ్రెస్ పార్టీ 6,29,143 సాధించి తన సమీప ప్రత్యర్థి పై 2,22,170 ఓట్లతో గెలిచారు. బిజెపి అభ్యర్థి4,06,973 ఓట్లు సాధించి ద్వితీయ స్థానంలో ఉండగా, బిఆర్ఎస్ పార్టీ 2,56187 ఓట్లతో తృతీయ స్థానం, సిపిఎం 28,730 ఓట్లతో నాలుగో స్థానంలో ఉంది. స్వతంత్ర అభ్యర్థులు అందరూ 6000 ఓట్లలోపనే ఉన్నారు.

మొదటి రౌండ్ నుండి ఆధిక్యత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తన సమీప అభ్యర్థి బిజెపి పై మొదటి రౌండ్ నుండి ఆధిపత్యాన్ని కొనసాగించారు. ) 01,0 46, 11వ రౌండ్లో 1,08,88 ఓట్లు, 12వ రౌండ్లో 1,17,308 ఓట్లు, 13 రౌండ్లో 1,27,400 కోట్లు 14 వ రౌండ్లో 1,41, 251 ఓట్లు, 15వ రౌండ్లో 1,55,023, 316, 19, 19 17వ రౌండ్లో 1,846 626, 18వ రౌండ్లో 1, 95,419, 19వ రౌండ్ల 203,540, 20వ రౌండ్ 2,09,914, 21 రౌండ్ 2,15, 673, 22 రౌండ్లలో 2,21,272,23 రౌండ్లలో 2,21,272,23 మెట్లలో గెలిచారు.
బిజెపి షాక్..
భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం లో అత్యధిక మెజార్టీతో గెలుస్తామని ఊహించిన బిజెపికి ఫలితాలు చూసి కండ్లు బైరు కమ్మాయి. మొదటి రౌండ్ నుండి కాంగ్రెస్ ఆధిపత్యంతో ముందంజలో ఉంది. ఇది తెలుసుకున్న బిజెపి అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ కౌంటింగ్ హాలు రాకుండానే వెళ్లిపోయారు. స్థానిక బిజెపికి మెజార్టీ సీట్లు వచ్చిన స్థానిక నాయకులలో అసంతృప్తి ఉంది. అక్కడి మోడీ భువనగిరిలో బూర అనే నినాదం బెడిసి కొట్టింది. అదేవిధంగా టిఆర్ఎస్ నాయకుడు క్యామ మల్లేష్ కౌంటింగ్ హాల్కు హాజరు కాలేకపోయారు.
ఆనందంలో కాంగ్రెస్ శ్రేణులు …
భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలుపొందడంతో కాంగ్రెస్ శ్రేణులు ఆనందంలో మునిగితేలారు. నియోజకవర్గంలో మొదటిసారి జరిగిన ఎన్నికల్లో లక్ష పైచిలుకు ఓట్లు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పొందగా, బూర నర్సయ్య గౌడ్ 30 వేల పైచిలుకు ఓట్లతో గెలుపొందగా మూడోసారి కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఐదువేల పైచిలుకు ఓట్లతో మాత్రమే గెలుపొందారు కానీ నాలుగోసారి ఎవరు ఊహించని విధంగా 2,22,170 విజయం సాధించారు.