Wednesday, December 10, 2025
Home » జూలై 1న ఏపీ సీఎం చంద్రబాబు వినూత్న నిర్ణయం..! – News Watch

జూలై 1న ఏపీ సీఎం చంద్రబాబు వినూత్న నిర్ణయం..! – News Watch

by News Watch
0 comment
జూలై 1న ఏపీ సీఎం చంద్రబాబు వినూత్న నిర్ణయం..!


అమరావతి, ఈవార్తలు : ఏపీలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం వినతు నిర్ణయాలతో దూసుకుపోతోంది. గత చంద్రబాబుకు.. ప్రస్తుత చంద్రబాబుకు తేడా చూపిస్తానని మాట ఇచ్చిన సీఎం.. అన్నట్లుగానే వినేందుకు తీసుకుంటున్నారు. మొన్నటికి మొన్న తిరుమలలో పదాలు తొలగించాలని డిమాండ్ చేయడం.. టీడీపీ పార్టీ ఆఫీస్‌లో కార్యకర్తలను కలవటం.. ఇలాంటి సంఘటనలు సరికొత్త చంద్రబాబును చూపిస్తున్నాయి. తాజాగా ఆయన మరో వినూత్న నిర్ణయం తీసుకున్నట్లు గుర్తించారు. తానే స్వయంగా పెన్షన్ అందజేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛను అందించాలని అనుకుంటున్నట్లు. జూలై 1న లబ్ధిదారుల ఇళ్ల వద్దే రూ.7 వేలు (చంద్రబాబు ప్రభుత్వం అందిస్తున్న రూ.4 వేలు, ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన బకాయి రూ.3 వేలు) స్వహస్తాలను అందిస్తారని సమాచారం. అందుకు తాడేపల్లి మండలం పెనుమాకాల్లో ఈ ఏర్పాట్లు చేయాలన్నారు. ఇదే జరిగితే దేశ చరిత్రలో స్వయంగా సీఎం.. లబ్ధిదారుల ఇంటికి పెన్షన్ అందించడం తొలిసారిగా. ఈ మేరకు అధికారులు కూడా గ్రామంలో లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేశారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch