వైయస్సార్ పార్టీ అధినేత, మాజీ వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితమైన నేత తాజా మాజీ రాజ్యసభ ముఖ్యమంత్రి సభ్యుడు విజయసాయిరెడ్డి ఆ పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ ప్రకటన రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. వైసీపీలో అత్యంత కీలకమైన నేతల్లో విజయసాయిరెడ్డి ఒకరు. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి కీలకంగా ఉంటూ వచ్చారు. ఒకరకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డికి ఆత్మగా వ్యవహరించారు. జగన్మోహన్ రెడ్డి కష్ట కాలంలోనూ, అధికారంలో ఉన్న సమయంలోనూ ఆయన వెంటే ఉన్నారు. అటువంటి విజయసాయిరెడ్డి ఇప్పుడు పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి దూరంగా జరుగుతున్నారంటే దానికి గల కారణాలు ఏమై ఉంటాయి అన్న విశ్లేషణలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అయితే పరిణామాలు, రాజ్యసభ రకాల సభ్యత్వానికి రాజీనామా చేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన విజయసారెడ్డి వ్యాఖ్యలను పరిశీలించిన పలు తర్వాత ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాజీనామా సందర్భంగా తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని విజయసాయిరెడ్డి వ్యవసాయం చేసుకుంటానని ప్రకటించారు. వ్యవసాయం చేసుకోవాలన్న కోరిక విజయసాయిరెడ్డికి ఉంటే.. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సిన అవసరం లేదన్నది చాలా చెబుతున్న మాట. రాజ్యసభ పదవికి వ్యవసాయం అడ్డంకిగా ఉండదు. అయితే విజయసాయిరెడ్డి రాజీనామాకు ప్రోత్సహించిన కారణాలు వేరే ఉన్నాయని చెబుతున్నారు. కాకినాడ డీప్ సీపోర్టు వ్యవహారంలో తన వియ్యంకుడుకు చెందిన అరబిందో సంస్థ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ వ్యవహారాన్ని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సీరియస్ గా మారింది. ఇప్పటికే ఈ వ్యవహారంపై విచారణ సాగుతోంది. ఈ నేపథ్యంలోనే కుమార్తె, అల్లుడు నుంచి తీవ్ర ఒత్తిడి ఉన్నట్లు చెబుతున్నారు. ఈ కేసు నుంచి తాము బయటపడేలా చేయాలన్న కుమార్తె, అల్లుడి కోరిక మేరకే విజయసాయిరెడ్డి ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెబుతున్నారు. తాను రాజీనామా చేస్తే ఈ పదవి కూటమి పార్టీలకు దక్కుతుందన్న విషయం రెడ్డికి తెలుసు. రాజ్యసభలో బలం పెంచుకునేందుకు తహతహలాడుతున్న బిజెపి విజయసాయిరెడ్డిని రాజీనామా చేయించడం పురిగొల్పినట్లు చెబుతున్నారు. విజయసాయి రెడ్డి రాజీనామా ద్వారా ఖాళీ అయిన బిజెపికి చెందిన మాజీ ముఖ్యమంత్రి కేటాయిస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇందుకు గాను బిజెపి అరబిందో సంస్థ ఎదుర్కొంటున్న కేసుల నుండి ఉపశమనాన్ని కల్పిస్తామన్న భరోసాను ఇచ్చినట్లు చెబుతున్నారు. అందుకే రాజకీయంగా ఉన్నత స్థానంలో నిలిచే విజయసాయిరెడ్డి అస్త్ర సన్యాసం వచ్చిందని చెబుతున్నారు.
బిజెపిలో చేరే అవకాశం..
ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటారని విజయసాయిరెడ్డి వెల్లడించారు. అయితే విజయసాయిరెడ్డి గురించి పూర్తిగా తెలిసినవారు ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటారంటే నమ్మరు. కొద్దిరోజులపాటు ఆయన రాజకీయాలకు దూరంగా ఉండి.. ఆ తర్వాత మళ్లీ యాక్టీవ్రన్న ప్రచారం జరుగుతుంది. ఈసారి జాతీయస్థాయి పార్టీ అయిన బిజెపిలో చేరి తన చిరకాల వాంఛ అయిన కేంద్ర మంత్రి పదవులు పొందే రాజకీయాలను సాగిస్తారన్న ప్రచారం ఉంది. ఇప్పటికే బీజేపీ నేతలతో ఈ మేరకు ఆయన ఒప్పందాన్ని చేసుకున్నట్లు చెబుతున్నారు. అయితే బిజెపి అగ్ర నాయకులు మోదీ, అమిత్ షా అవసరం ఉన్నవరకే ఎవరికైనా ప్రాధాన్యత ఇస్తారు. ఎంపీ పదవికి విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన తర్వాత ఒక సాధారణ వ్యక్తిగా మారిపోతారు. అటువంటి వ్యక్తిని పిలిచి పదవులను కట్టబెట్టే అంత అమాయకులు అమిత్ షా, మోడీ కారు. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డిని బిజెపిలో చేర్చుకునే అంశంలో ఈ ఇద్దరు నేతలు ఎటువంటి ఆలోచన చేస్తారు అన్నది కూడా అనేక అనుమానాలకు తావిస్తోంది. విజయసాయిరెడ్డి బిజెపిలోకి వస్తే సమ్మతించేందుకు బిజెపిలోని కొందరి నేతలు ఉండరని అంటున్నారు. ఇప్పటికే కొంతమంది నాయకులు బిజెపి అధిష్టానానికి కూడా విజయసాయిరెడ్డి నేతలను బిజెపిలో చేర్చుకోవద్దంటూ ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి రాజకీయ బృతవ్యం ఎలా ఉండబోతుందన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల్లో విజయసాయిరెడ్డి అప్రూవరుగా మారుతారు అన్న ప్రచారం. అయితే, రాజీనామా అనంతరం మీడియాతో మాట్లాడిన విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి బాగుండాలని ఆకాంక్షించారు. ఆయన రాజకీయంగా బలమైన నేతగాను వర్ణించారు. ఈ వ్యాఖ్యల అనంతరం విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి అక్రమస్తుల కేసులో అప్రూవల్ గా మారతారు అన్న ప్రచారంలో వాస్తవం లేదన్నది కూడా నిపుణుల విశ్లేషణ. మరి విజయసాయిరెడ్డి ఎటువంటి పరిస్థితుల్లో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. విజయ్ సాయి రెడ్డి వేసే అడుగులను బట్టి ఒక స్పష్టత వస్తుందని, అంతవరకు వేచి ఉండాల్సిందేనని మరికొందరు చెబుతున్న మాట.
సైఫ్ అలీ ఖాన్ కేసులో బిగ్ ట్విస్ట్.. నిందితుడు వేలిముద్రలు మిస్ మ్యాచ్
ఆరోగ్యంగా ఉండాలంటే ఏ ఆహారాలు తినాలంటే..