18
వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోటశ్రీకాంత్ రెడ్డి
విధి నిర్వహణలో అశువులు బాసిన పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివని వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు.పోలీసు అనే పదానికి సేవ, త్యాగం, గంభీరం, తెగువ పర్యాయ పదాలన్నారు.1959 అక్టోబర్ 21 న జరిగిన దురదృష్ట సంఘటననుగుర్తుచేసుకుంటూ వారి త్యాగాలును స్మరణం చేసుకోవడం కోసం ప్రతి ఏటా అక్టోబర్ 21 న పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు.ఏ అన్యాయం జరిగినా, ఏ ఆపద కలిగినా ప్రజలకు ముందుగా గుర్తొచ్చేది పోలీసు అని, పోలీసు లేని సమాజాన్ని ఊహించ లేమని, శాంతి భద్రతల కట్టడిలో పోలీసు వ్యవస్థ చాలా కీలకంగా పనిచేస్తోందన్నారు. విపత్కర పరిస్థితుల్లో వారు కుటుంబాలకు సైతం దూరంగా ఉంటూ విధులు నిర్వహిస్తున్న పోలీసు వ్యవస్థపై ఎంతో గౌరవం ఉందన్నారు. అమరులైన పోలీసులకు శ్రీకాంత్ రెడ్డి నివాళులు అర్పించారు.