Saturday, October 19, 2024
Home » విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి టిడిపి.. ఆశావహుల జాబితా పెద్దదే – News Watch

విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి టిడిపి.. ఆశావహుల జాబితా పెద్దదే – News Watch

by News Watch
0 comment
విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి టిడిపి.. ఆశావహుల జాబితా పెద్దదే


ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరగనుంది. ఈ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా ఎన్నికైన వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ సార్వత్రిక ఎన్నికలకు ముందు రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరారు. ఆ ఎన్నికల్లో విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రాజీనామా చేసిన ఈ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికల నిర్వహించేందుకు ఇప్పటికే ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. అధికార వైసిపి అభ్యర్థిగా మాజీ మంత్రి ఉత్తరాంధ్ర సీనియర్ నేత బొత్స సత్యనారాయణను ఆ పార్టీ బరిలోకి దించుతోంది. సాధారణంగా అయితే వైసిపి ఈ సులభంగా గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. 800పైగా ఓట్లు ఉన్నాయి. వీరిలో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు ఓటర్లుగా ఉన్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అంతా 90 శాతం మంది వైసీపీకి చెందిన వారే ఉన్నారు. ఈ నేపథ్యంలో వర్షం సత్యనారాయణ విజయం నల్లేరుపై నడకగానే అంతా ఉంది. కానీ అధికార టిడిపి పోటీకి అభ్యర్థిని బరిలోకి దించేందుకు సిద్ధమవుతోంది. సామ, దాన, బేద, దండోపాయాలను ఉపయోగించి వైసీపీకి చెందిన స్థానిక సంస్థల ప్రతినిధులను పార్టీలో చేర్చుకోవాలని టిడిపి భావిస్తోంది. శాసన మండలిలో ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి ఆశించిన స్థాయిలో ఎమ్మెల్సీలు లేరు. ఈ నేపథ్యంలో ఈ ఎమ్మెల్సీ కొంత కైవసం చేసుకోవడం ద్వారా బలం పెంచుకోవాలని టిడిపి భావిస్తోంది. మరో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో సోమవారం పార్టీ ఆఫీసులో సమావేశమైన జిల్లా ఉన్నారు.

ఈ సమావేశంలో ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన వైసీపీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధులను పార్టీలో చేర్చుకోవడంపై లక్ష్యాలను విధించే అవకాశం ఉందని చెబుతున్నారు. అదే సమయంలో ఈ స్థానం కోసం పోటీ పడుతున్న వారి సంఖ్య కూడా టిడిపిలో ఎక్కువగానే ఉంది. మొన్నటి వరకు దక్షిణ నియోజకవర్గ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తూ పొత్తులో భాగంగా జనసేనకు ఆ సీటును కేటాయించడంతో పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చిన ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జి, అనకాపల్లి జిల్లాలో కూడా సీటును త్యాగం చేయాల్సిన మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, పి వి జి కుమార్, బిజెపి నుంచి ఈర్ల శ్రీరామ్ మూర్తి ఈ ఎమ్మెల్సీ స్థానాల్లో ఉన్నారు. కోరుకుంటున్నారు. అయితే అధికార పార్టీ ఎత్తులకు పైఎత్తులను వేస్తూ వైసిపి కూడా ఈ అంశాలను నిలబెట్టుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఆర్థికంగా బలంగా ఉన్న బొత్స సత్యనారాయణను బరిలోకి దించడం ద్వారా అధికార పార్టీ టిడిపిని జగన్ మోహన్ రెడ్డి డిఫెన్స్ లోకి నెట్టినట్టు అయింది. ఈ మూడు జిల్లాల్లో బొత్స సత్యనారాయణ అనుచరగణం ఎక్కువగానే ఉన్నారు. ఆయన అయితేనే అంతా కలిసికట్టుగా పనిచేస్తారని ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి బొత్సను ఎంపిక చేశారు. బొత్స సత్యనారాయణ సైలెంట్‌గా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఎమ్మెల్సీ చేసుకుంటామని కైవసం చేసుకుంటామని వైసిపి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తుండగా, టిడిపి మాత్రం ఈ స్వాధీనంనే దిశగా వ్యూహాలు పన్నుతోంది. చూడాలి ఎవరి ఎత్తులకు ఎవరు చిత్తవుతారు.

జిల్లా అధ్యక్షుల నియామకంపై వైసీపీ అధినేత జగన్ కసరత్తు
బంగారం కొనడానికి వెళ్తున్నారా.. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే మోసపోతారు..!

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch