Friday, October 18, 2024
Home » వివేకా హత్య కేసులో సాక్షికి భద్రతను పునరుద్ధరించండి.. వైఎస్సార్ జిల్లా ఎస్పీకి హైకోర్టు ఆదేశం

వివేకా హత్య కేసులో సాక్షికి భద్రతను పునరుద్ధరించండి.. వైఎస్సార్ జిల్లా ఎస్పీకి హైకోర్టు ఆదేశం

0 comment

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కడపకు చెందిన సాక్షి కొమ్మా శివచంద్రారెడ్డికి భద్రతను పునరుద్ధరించాలని వైఎస్సార్‌ జిల్లా ఎస్పీని హైకోర్టు ఆదేశించింది. జిల్లా జడ్జి నేతృత్వంలోని కమిటీ.. సాక్షుల రక్షణ పథకం కింద పిటిషనర్‌కు 1+1 పోలీసు భద్రత కల్పించిందని గుర్తుచేసింది. జిల్లా జడ్జి అనుమతి లేకుండా ఏ విధంగా తొలగిస్తారని ప్రశ్నించింది. జిల్లా జడ్జి నేతృత్వంలోని కమిటీ నిర్ణయం ప్రకారం పోలీసులు భద్రత తొలగించాలా, కొనసాగించాలా అనే వ్యవహారం ముడిపడి ఉంటుందని పేర్కొంది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బీవీఎల్‌ఎన్‌ చక్రవర్తి సోమవారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch