Saturday, April 5, 2025
Home » అధికారం కోసం చంద్రబాబు ఎవరినైనా పొడుస్తాడు: వైఎస్ జగన్ – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

అధికారం కోసం చంద్రబాబు ఎవరినైనా పొడుస్తాడు: వైఎస్ జగన్ – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

by News Watch
0 comment



ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ వైఎస్సార్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌ పథకం లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. 2023–24 సీజన్‌కు సంబంధించి 52 లక్షలకుపైగా రైతు కుటుంబాలకు తొలి విడతగా 7 వేల 500 చొప్పున పెట్టుబడి సాయంతో పాటు.. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కురిసిన అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన 51 వేల మంది రైతులకు ఇన్‌పుట్‌ ​​సబ్సిడీని అందిస్తోంది.. జమ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్.. చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. అధికారం కోసం చంద్రబాబు ఎవరినైనా పొడిచేందుకు వెనుకాడరంటూ గురించి. రాజమండ్రిలో మహానాడు పేరుతో డ్రామా చేశారన్నారు.

వెన్నుపోటు పొడిచి చంపిన వ్యక్తిని ఇప్పుడు యుగపురుషుడు, రాముడు, కృష్ణుడు అంటూ కీర్తిస్తున్నారు. మ్యానిఫెస్టోను చూస్తుంటే ఆశ్చర్యమనిపిస్తుందని చెప్పారు. మట్టి నుంచి తమ మ్యానిఫెస్టో పుట్టిందని.. కర్ణాటక నుంచి బాబు మ్యానిఫెస్టో పుట్టిందంటూ. పొత్తుల కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారని చెప్పారు. వైసీపీ హామీలు కాపీ కొట్టి.. పులిహోర వందరంటూ తెలియజేశారు. 175 సీట్లలో పోటీ చేసేందుకు క్యాండెట్లు కూడా లేరంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు పాలనలో ప్రతీ ఏటా కరువే.. టీడీపీ పాలనలో కనీసం సగం మండలాలను కరువు మండలాలుగా ప్రకటించేవారంటూ పేర్కొన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో కరువు లేదు, వలసలు లేవన్నారు. గత ప్రభుత్వ పాలనకు, మీ బిడ్డ పాలనకు మధ్య తేడా చూడాలని.. మహానేత వైఎస్సార్‌ జయంతి రోజున ఇన్సూరెన్స్ సొమ్ము కూడా జమ చేస్తామంటూ సీఎం జగన్ పేర్కొన్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch