Thursday, December 11, 2025
Home » తెలుగుదేశం జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడును కలిసి తెలిపిన సౌత్ ఇండియన్ ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యులు – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

తెలుగుదేశం జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడును కలిసి తెలిపిన సౌత్ ఇండియన్ ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యులు – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
 తెలుగుదేశం జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడును కలిసి తెలిపిన సౌత్ ఇండియన్ ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యులు - తాజా తెలుగు వార్తలు |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్


సౌత్ ఇండియన్ ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో బుధవారం నాడు కలిసి మాట్లాడారు. సక్యులరిజానికి చంద్రబాబు నాయుడు ఐకాన్‌గా నిలిచారని అన్నారు.

మత సామరస్యాన్ని కాపాడటంలో టీడీపీ ఎప్పుడూ ముందుంటుందన్నారు. సామాజిక పనితీరును చంద్రబాబు ఎల్లప్పుడూ పాటిస్తున్నారు. ప్రజా రాజధానిగా అమరావతి నిర్మాణంతోనే అన్ని వర్గాలకు సాధ్యమన్నారు. 2024 టీడీపీ మేనిఫెస్టో మైనారిటీ వర్గాల అభ్యున్నతికి దోహదపడుతుంది. ముస్లీంల అభివృద్ధికి తోడ్పడే మేనిఫోస్టోని ప్రకటించిన టిడిపికి అభినందనలు. లాల్ జాన్ భాష వంటి నాయకులను రాజ్యసభకు పంపించింది తెలుగుదేశం పార్టీనే అని గుర్తు చేసుకున్నారు. దక్షిణ భారతదేశంలో ముఫ్తీలు, ఉలేమాలు, మత పెద్దలు వంటి వారితో సౌత్ ఇండియన్ ముస్లిం పర్సనల్ లా బోర్డుకు సత్సంబంధాలు ఉన్నాయి.

తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి మా ఆర్గనైజేషన్ ద్వారా సాయశక్తుల కృషి చేస్తాం. ఆంధ్రరాష్ట్రంలో ఉన్న ముస్లిం… సోదర సోదరీమణులు అందరూ ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించి చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేశారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch