ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మంగళవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్ళనున్నారు. మంగళవారం ఉదయం ముందుగా ఆయన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు ఢిల్లీ వెళ్ళనున్నారు. బుధవారం ఉదయం కేంద్ర హోం మంత్రి హామిత్ షా సహా మరి కొందరు కేంద్ర మంత్రులను కలవనున్నారు. అదేరోజు రాత్రి రాష్ట్రానికి తిరిగి వస్తారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా రాష్ట్రానికి అవసరమైన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిగా కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరనున్నారు.
ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు పూర్తికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, సహకారాన్ని అందించాలని అమిత్ షాను కోరనున్నారు. ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వం ఉన్న క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడేందుకు బడ్జెట్లో భారీగా రాష్ట్రానికి కేటాయింపులు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు కోరనున్నారు. వీటితోపాటు గత ప్రభుత్వం ఆర్థిక అవకతవకలకు సంబంధించిన అంశాల పైన కేంద్ర హోంమంత్రితో చంద్రబాబు నాయుడు చర్చించినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రితో కూడా సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే కీలకమైన ప్రాంతాల మీదుగా జాతీయ నిర్మాణ నిర్మాణంతోపాటు ఇప్పటికే ప్రాజెక్టు నిర్మాణాలకు సంబంధించిన పలు ప్రతిపాదనలు ఉన్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతోపాటు కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్తోపాటు ఎంపీలు పాల్గొన్నారు.