2
గత కొంత కాలంగా మేడారం అభివృద్ధి పనులపై సీఎం రేవంత్ దృష్టి పెట్టారు. మేడారం సమ్మక్క, సారలమ్మ గద్దెలను పునరుద్ధరించే దిశగా మాస్టర్ ప్లాన్ను రూపొందించారు. మాస్టర్ ప్లాన్ అమలులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి గత నెల 23న మేడారాన్ని కూడా సీఎం రేవంత్ సందర్శించారు. ఈ కార్యక్రమాలన్నీ మంత్రులు పొంగులేటి, కొండా సురేఖ, సీతక్క పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే పనులు కూడా ప్రారంభమై… వేగంగా కొనసాగుతున్నాయి. ఈ విధంగానే మంత్రుల మధ్య టెండర్ల వార్ తెరపైకి రావటంతో… పార్టీ నాయకత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది…! ఈపై మంత్రి కొండ వైపు నుంచి గానీ మంత్రి పొంగులేటి వైపు నుంచి కానీ అధికారికంగా ఎలాంటి స్పందన రాలేదు..!