
- ప్రమాదకరంగా గుంతలు.. తప్పని తిప్పలు
- అధ్వానంగా మారిన జూలూరు- రుద్రేల్లి వంతెన
భూదాన్ పోచంపల్లి, ముద్ర:- భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని జూలూరు -రుద్రెల్లి గ్రామాల మధ్యగల లోలెవెల్ వంతెన ప్రమాదకరంగా మారింది. ఈ వంతెనపై అడుగడుగున గుంతలకు తోడు ఇనుప చువ్వలు తేలడం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రాత్రి సమయంలో ఈ వంతెనపై ప్రయాణించాలంటే ఎక్కడ గుంతలు ఉన్నాయో తెలియని పరిస్థితి. ఈ వంతెనపై రవాణాే ప్రయాణికుల వాహనాల టైర్లు అనేకంగా ఉన్నాయి.
పోచంపల్లి నుండి బీబీనగర్ కు వెళ్లాలంటే ఈ దారి గుండ వెళ్లాల్సిందే. వర్షాకాల సమయంలో ఈ వంతెనపై నీరు ప్రవహించడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. అదే సమయంలో భువనగిరికి వెళ్లాలంటే వయ పెద్ద రావులపల్లి నుండి వెళ్లాల్సి వస్తుంది. ప్రస్తుతం ఈ వంతెన పై నుండి నీటి పారకం లేనందున ఈ సమయంలోనే నో లెవల్ వంతెన పై మరమ్మతు చర్యలు చేపడితే ప్రయోజనకరంగా ఉంటుంది .గతంలో జూలూరు నుండి రుద్రేల్లి వరకు బ్రిడ్జి నిర్మాణ పనులను ప్రారంభించి మధ్యలోనే వదిలేశారు. అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేయాలని వాహనదారులు కోరుతున్నారు.