
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి ఊరట లభించింది. ఐఆర్ఆర్ కేసులో సోమవారం ధర్మాసనం విచారణ జరిపింది..
చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు పిటీషన్ను త్రోసి పుచ్చింది. కనీసం నోటీసులు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. గతంలో ఇదే కేసులో దాఖలు చేసిన ఎస్ఎల్పి ని రద్దు చేసిన నేపథ్యంలో చంద్రబాబు బెయిల్ రద్దు పిటీషన్ను విచారించాల్సిన అవసరం లేదని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఐఆర్ఆర్ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు..
420 చంద్రబాబుకు ఎలా వర్తిస్తుందని న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా ప్రశ్నించారు. 17 ఏ సెక్షన్తో ఈ కేసుకు కూడా సంబంధం ఉందా? అని ధర్మాసనం నిలదీసింది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు పిటీషన్ పై ఈ రోజు విచారణ జరిగింది.
కాగా, ఐఆర్ఆర్ ఏపీ హైకోర్టు చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో, ఏపీ ప్రభుత్వం హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాలు చేసింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దత్తా నేతృత్వం లోని ధర్మాసనం విచారణ జరిపింది.