Friday, March 20, 2026
Home » గండాలయ స్వామి ఆలయానికి మెట్లమార్గం – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

గండాలయ స్వామి ఆలయానికి మెట్లమార్గం – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

by News Watch
0 comment
 గండాలయ స్వామి ఆలయానికి మెట్లమార్గం - Latest Telugu News |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్


మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరిలో శ్రీపానకాల లక్ష్మీనరసింహ స్వామి స్వయంభువుగా వెలిసిన పర్వతం శిఖర భాగాన గల గండాలయ స్వామి ఆలయానికి భక్తులు కాలినడకన చేరుకునేందుకు వీలుగా దాతల సహకారంతో నిర్మించిన 1283 మెట్ల మార్గాన్ని సోమవారం సాయంత్రం స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి,ఎమ్మెల్సీ ఎం హనుమంతరావు, దాత సింహాద్రి వెంకట రామారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ మెట్ల మార్గం నిర్మాణానికి సహకరించిన దాతలను అభినందించారు.సింహాద్రి వెంకటరామారెడ్డి మాట్లాడుతూ గండాలయ స్వామి ఆలయం వద్ద దీపం వెలిగించేందుకు వెళ్లే భక్తులను ప్రత్యక్షంగా గమనించి మెట్లమార్గం ఆవశ్యకతను గుర్తించి పెద్దల సూచనలతో తానే భూరి విరాళం అందజేసి నిధి సేకరణకు ప్రేరణ కల్పించినట్లు తెలిపారు. ఎమ్మెల్సీ హనుమంతరావు భక్తుల సౌకర్యార్థం మెట్ల నిర్మాణం గావించడం అభినందనీయమన్నారు. ఆలయ సహాయ కమిషనర్ రామకోటిరెడ్డి, అర్చకులు, కాజ గ్రామానికి చెందిన పెద్దలు ఉన్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch