
ముద్ర,ఆంధ్రప్రదేశ్:- సీఎం జగన్ పై దాడికి నిరసనగా సత్తెనపల్లిలో నల్లజెండాలతో వైసీపీ పార్టీ నేతలు ర్యాలీ చేశారు. ఈ ర్యాలీలో మంత్రి అంబటి రాంబాబు ఉన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ పై జరిగిన దాడిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజల ఆదరణ అనేక సంక్షేమ పథకాలను సీఎం జగన్తో అందించారని అన్నారు.
జగన్ ను ఎదుర్కొనే దమ్ము ఎవరికీ లేదని అన్నారు. చంద్రబాబు కుళ్ళు కుతంత్రాలతో రాజకీయం చేస్తున్నాడని. విజయవాడని టీడీపీకి అడ్డా అని చంద్రబాబు అనుకుంటున్నాడని. ప్రజాస్వామ్య సాధనలో ఎదుర్కోలేక ఈ దాడులు చేయిస్తున్నాడు చంద్రబాబు అని ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి జగన్ ను హతమార్చాలని చూస్తున్నాడని సంచలన ఆరోపణలు చేశారు.
విజయవాడలో తనకు అడ్డుగా ఉన్నాడని వంగవీటి మోహన్ రంగని చంద్రబాబు హత్య చేయించాడని అన్నారు. ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని కూడా అనేక ఇబ్బందులకు గురి చేశాడని పేర్కొన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ కు ఇవే చివరి ఎన్నికలని అన్నారు.
జగనన్నకు అయిన గాయం
తెలుగు ప్రజలకు అయిన గాయం
బాబు మూల్యం చెల్లించక తప్పదు@ncbn pic.twitter.com/3BFMjzqswx— అంబటి రాంబాబు (@AmbatiRambabu) ఏప్రిల్ 13, 2024