Saturday, October 19, 2024
Home » ఇసుక విధానంపై వైసీపీ విమర్శలు.. ఘాటుగా స్పందించిన సీఎం చంద్రబాబు నాయుడు – News Watch

ఇసుక విధానంపై వైసీపీ విమర్శలు.. ఘాటుగా స్పందించిన సీఎం చంద్రబాబు నాయుడు – News Watch

by News Watch
0 comment
ఇసుక విధానంపై వైసీపీ విమర్శలు.. ఘాటుగా స్పందించిన సీఎం చంద్రబాబు నాయుడు



రాష్ట్రంలో అమలవుతున్న ఉచిత ఇసుక విధానంపై వైసిపి చేస్తున్న విమర్శలపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఘాటుగా స్పందించారు. ఇంటింటికి ప్రభుత్వం వెళ్లి ఇసుక డోర్ డెలివరీ చేయాలన్నట్టు వైసిపి విమర్శలు ఉన్నాయని ధ్వజమెత్తారు. ఇసుక తవ్వడం వరకే మాత్రమే అని స్పష్టం చేశారు. ఉచిత ఇసుక కూడా తప్పుపట్టే పరిస్థితికి వచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటింటికి వెళ్లి ఉచిత ఇసుక ఇవ్వలేమని. ఇసుక కొన అవసరం లేకుండా చేశామన్న చంద్రబాబు నాయుడు.. రవాణా ఖర్చులు, కూలీలు ఖర్చులు, జీఎస్టీ ఎవరైనా ఇచ్చుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. ఇవన్నీ చెల్లించిన గత ప్రభుత్వం హయాంలో ఉన్న రేట్లు సగం కంటే తక్కువ ధరకే ఇసుక వస్తుందని వివరించారు. ప్రజలకు మంచి జరుగుతోందన్న ఆలోచన లేకుండా ఈ విధానంపై కూడా విమర్శలు చేస్తుంటే వారిని ఏం అనాలో అర్థం కావడం లేదని చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ఇసుక విధానంలో భాగంగా ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున ఇసుక అందుబాటులోకి తీసుకొచ్చామని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఉచిత ఇసుక విధానంతో రేటు భారీగా పడిపోయిందన్న ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఇన్నాళ్లు ఇసుకను భారీ ధరకు కొనుగోలు చేసిన ప్రజలు ఇబ్బందులు పడ్డారని, ఉచిత ఇసుక విధానంతో ప్రజలు ఇప్పుడు సంతోషంగా ఉన్నారు.రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణ పనులు ఇసుక విధానంతో ఊపందుకున్నాయని స్పష్టం చేశారు. పది మందికి ఉపాధి కూడా లభిస్తుందని తెలుస్తోంది. ప్రజలకు జరుగుతున్న మంచిని భరించలేక వైసీపీ వాళ్లు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటూ వస్తున్నామని, అడ్డగోలు విధానాలతో అన్ని వ్యవస్థలను గాడిలో పెడుతున్నామని. అందులో భాగంగానే ఉచిత ఇసుక విధానాన్ని ప్రదర్శించినట్లు స్పష్టం చేశారు. ఇసుక కావాల్సిన వాళ్ళు

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch