
- మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం
- 100కు పైగా టీంలతో క్రికెట్ పోటీలను ప్రారంభించిన “ఎమ్మెల్యే శంకర్”
ముద్ర, షాద్ నగర్: రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. బుధవారం షాద్నగర్ లో మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ 2024 ను స్థానిక ఎమ్మెల్యే “వీర్లపల్లి శంకర్” లాంచనంగా కలిగి ఉన్నారు. స్టేడియంలో మొదట బ్యాటింగ్ చేసి టోర్నమెంటును కలిగి ఉంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన క్రీడాకారుల కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకర్ వేసవి సెలవుల సందర్భంగా విద్యార్థులకు, యువకులకు ఉత్సవాలను ఏర్పాటు చేయడం పట్ల నిర్వాహకులను అభినందించారు.
ప్రభుత్వం క్రీడలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే శంకర్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర అంతర్జాతీయ క్రీడా పోటీలకు వేదిక కానుందని సూచనప్రాయంగా తెలిపారు. 2036లో అంతర్జాతీయ క్రీడా పోటీలు జరగబోతున్నాయని దీనికి సంబంధించి హైదరాబాద్లో ఇప్పటినుండే పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయని ఎమ్మెల్యే శంకర్ అన్నారు. అదేవిధంగా ప్రభుత్వ సహకారంతో ఎన్నో నియోజకవర్గాల్లో ఇండోర్, ఇతర సౌకర్యాలతో నూతన స్టేడియాలు సైతం అత్యాధునికంగా నిర్మించబోతున్నామని తెలిపారు. ఇందులో భాగంగానే షాద్ నగర్ నియోజకవర్గం ఉన్న ఇండోర్ స్టేడియం అత్యాధునికంగా నిర్మించేందుకు సుమారు రెండున్నర కోట్ల వరకు ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా నియోజకవర్గంలోని కొండూర్గు మండలంలో కూడా నిర్మాణం ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే ప్రకటించారు.
క్రీడలకు సంబంధించి లోటుపాట్లు ఉంటే తన దృష్టికి తేవాలని మేర తాను వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. క్రీడాకారులు తమ నైపుణ్యతను చాటుకునే విధంగా క్రీడలపై దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే అన్నారు. హైదరాబాద్కు అత్యంత సమీపంలో ఉన్న ఈ నియోజకవర్గంలో క్రీడలకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అత్యాధునిక పరిజ్ఞానంతో అన్ని వనరులు కల్పించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి స్పోర్ట్స్ అథారిటీకి సంబంధించి ఇక్కడ క్రీడాభివృద్ధి కోసం పాటుపడుతున్నారని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
ఈ టోర్నమెంట్ కు సంబంధించి మొదటి బహుమతి 50 వేల రూపాయలను కాంగ్రెస్ నాయకుడు గోపాల్ రెడ్డి ప్రకటించారు. అదేవిధంగా రెండవ బహుమతి 25 వేల రూపాయలను అనిల్ రెడ్డి ప్రకటించారు. ఇంకా ఈ క్రికెట్ పోటీలను సమర్పించిన వారిలో హరికుమార్, ఎజాజ్, మహ్మద్ రవూఫ్, మాజీ కౌన్సిలర్ రాజేందర్ రెడ్డి సహకరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి సభ్యులు మొహమ్మద్ అలీ ఖాన్, తిరుపతి రెడ్డి, యువ నాయకుడు క్రీడాకారుడు గోపాల్ రెడ్డి, యువ నాయకులు ముబారక్ , శ్రీను నాయక్, మురళీమోహన్ అప్పి, దిలీప్, రాజు నాయక్, అశోక్ నాయక్ ఉన్నారు..