8

ముద్ర,తెలంగాణ:- తెలంగాణ రాష్ట్ర నూతన చిహ్నం రూపు, గీతం రూపకల్పన తుది దశకు చేరుకుంది. దింతో అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ వేడుకలను విడుదల చేయడానికి ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ ఈరోజు కీలక సమావేశమయ్యారు.
రాష్ట్ర చిహ్నం, రాష్ట్ర గీతంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై సీపీఐ, సీపీఎం, జనసమితి పార్టీల నేతలతో సచివాలయంలో సమావేశం అవుతారు సీఎం రేవంత్. అయితే ఈ సమావేశానికి బీజేపీ, బీఆర్ఎస్కు ఆహ్వానం పంపలేదు.ఇప్పటికే రాష్ట్ర చిహ్నం, గీతం రూపకల్పనపై సర్కార్ స్పీడ్ పెరిగింది. అమరవీరుల పోరాటం, త్యాగాలను ప్రతిబింబించేలా రాష్ట్ర చిహ్నం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు ఉన్నాయి. కళాకారుడు రుద్ర రాజేశం రూపొందించిన నమూనాపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.