Monday, February 23, 2026
Home » ఏపీలో సంక్షేమ పథకాల నిధులు విడుదల – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

ఏపీలో సంక్షేమ పథకాల నిధులు విడుదల – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

by News Watch
0 comment
 ఏపీలో సంక్షేమ పథకాల నిధులు విడుదల - Latest Telugu News |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర,ఆంధ్రప్రదేశ్:- ఏపీలో సంక్షేమ పథకాల్లో భాగంగా లబ్దిదారులకు బహుమతులు అందజేస్తారు. ఎన్నికల సంఘం ఆంక్షలు పోలింగ్‌తో ముగియడంతో.. డీబీటీ పథకాలకు నిధులు విడుదల చేశారు. బుధవారం ఆసరా పథకానికి రూ.1480 కోట్లు విడుదల చేశారు. అలాగే జగనన్న విద్యాదీవెన కింద సంపూర్ణ ఫీజు రింబర్స్ మెంట్ కోసం రూ.502 కోట్లు విడుదలయ్యాయి. మిగిలిన పథకాలకు కూడా ఈరోజు, రేపు నిధులు విడుదల చేయాలని ఏపీ సర్కార్ ప్రకటన చేసింది. రెండు, మూడు రోజుల్లో పూర్తి నిధులు విడుదల చేయగలిగారు.

ఈ ఏడాది జనవరి నుంచి మార్చి మధ్య కాలంలో ఆరు పథకాలకు చెందిన దాదాపు రూ.14 వేల కోట్లను లబ్దిదారులకు విడుదల చేస్తూ సీఎం జగన్ బటన్ నొక్కారు. అయితే రాష్ట్ర ఖజానాలో తగిన నిధులు కూడా బటన్ అవసరం వెంటనే నగదు జమ చేయకుండా ఎన్నికల పోలింగ్ వరకు వేచి చూశారని.. పోలింగ్ ముందు ఖాతాల్లో జమ చేసేందుకు సిద్ధమయ్యారని టీడీపీ ఆరోపణలు చేసింది. ఈ డబ్బును కాంట్రాక్టర్లకు చెల్లించేందుకు ప్రయత్నించారంటూ విమర్శలు చేసింది. దీంతో ఈ విషయంపై ఈసీకి ఫిర్యాదు చేయగా.. తాజాగా ఆ నిధులను విడుదల చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch