11
జాతీయ క్రీడలు: ఉత్తరాఖండ్లో జనవరి 28 నుంచి ఫిబ్రవరి 14 వరకు జరగనున్న 38వ జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ జట్లకు ఏపీ ఒలంపిక్ అసోసియేషన్ ప్రాతినిథ్యం వహించాలని ఏపీ హైకోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. రాష్ట్రం నుంచి క్రీడాకారులను పంపే విష యంలో ఇండియన్ ఒలింపిక్ అసోసియే షన్ జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్(శాప్), ఏపీ ఆర్చరీ ఏపీ ఏపీ అథ్లెటిక్, ఆంధ్రప్రదేశ్ జూడో, ఏపీ ఖోఖో, ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్లకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.