17
రాష్ట్రంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్న వేళ కోడి పందేలు, పేకాట, గుండాట వంటి జూద క్రీడల్లో కోట్లు చేతులు మారుతున్నాయి. డబ్బు వచ్చిన వారు ఆనందంతో ఇళ్లకు వెళ్తున్నారు. డబ్బులు పోయినవారు దుఃఖంతో ఇంటికి వెళ్తున్నారు. భోగి రోజున ప్రారంభమైన కోడి పందేలు, పేకాట, గుండాట రాత్రి పగలు తేడా లేకుండా నిరాటంకంగా కొనసాగుతున్నాయి. అక్కడే భోజనం, మందు, నీళ్లు, ఇతర తినిబండరాళ్లు స్టాల్స్ పెట్టి అమ్మడంతో పందె రాయుళ్లు, జూద క్రీడలు ఆడేవారు అక్కడ నుంచి వెళ్లటం లేదు.