సంబంధంలేని వారిపై సస్పెన్షన్ వేటు
తొక్కిసలాటపై విచారణ చేసి, జైల్లో పెట్టాల్సిన బాధ్యులను చంద్రబాబు ప్రభుత్వం విడిచిపెట్టిందంటే దాని అర్థం ఏంటని వైఎస్ జగన్ ప్రశ్నించారు. జరిగిన ఘోరమైన ఘటనను ప్రభుత్వం సీరియస్గా తీసుకోలేదనేకదా అర్థం? అవలో. తూతూమంత్రంగా ఏదో తీసుకున్న చర్యలు అధికారులు, టీటీడీ పాలక మండలిని కాపాడడానికే కదా? అని ప్రశ్నించారు. శ్రీవారి భక్తుల మరణాలకు అసలు కారకులను రక్షించే ప్రయత్నం ఎందుకు చేస్తోంది? అని ప్రశ్నించారు. తూతూమంత్రంగా తీసుకున్న ఆ కొద్దిపాటి చర్యల్లోనూ వివక్ష చూపలేదంటారా? సంబంధంలేని వారిపై సస్పెన్షన్ వేటు వేయడం, అరెస్టుచేసి జైల్లో పెట్టాల్సిన అధికారిని కేవలం బదిలీతో సరిపెట్టడం, మరికొందరిపై అసలు చర్యలు లేకపోవడం, ప్రభావం లేని సెక్షన్లతో కేసులు పెట్టడం, వెంటనే టీటీడీ చైర్మన్, ఈవోను, ఏఈఓను, ఎస్పీను, కలెక్టర్ను డిస్మిస్ చేయకపోవడం, ఈ దోషులను కాపాడడానికేనా? అని.