24
అదనపు షోల అనుమతి రద్దు చేసిన ఏపీ ప్రభుత్వం
ఏపీ హైకోర్టుతో గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ చిత్రాల అదనపు షోలు, టికెట్ ధరల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం సవరణ చేసింది. గేమ్కేంజర్ సినిమాపై ఇచ్చిన ఆదేశాలు కేవలం టికెట్ ధరలకు మాత్రమేనని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. సరైన భద్రత లేని థియేటర్లకు వచ్చే ప్రజలను నియంత్రించడం కష్టమని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ మేరకు అదనపు షోలపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అర్ధరాత్రి 1 గంట, తెల్లవారుజామున 4 గంటలకు అదనపు షోలకు అనుమతిని రద్దుచేసింది. 10 రోజుల పాటు రోజుకు 5 షోలకు మించకుండా సినిమా ప్రదర్శించేందుకు అవకాశం ఉంది. రోజుకు 5 షోలలో ఒకటి బెనిఫిట్ షోగా నిర్వహించుకోమని ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టుతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసింది.