10
వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల విడుదల సందర్భంగా బైరాగిపట్టెడలోని పద్మావతి పార్కు వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం, 40మందికి పైగా గాయాలు పాలవడం గమనించవచ్చు. మృతి చెందిన వారి కుటుంబాలను ఆసుపత్రి మార్చురీ వద్ద ముఖ్యమంత్రి పరామర్శించారు. బాధిత కుటుంబాలను పరామర్శించడంతో తిరుమలకు వెళ్లకూడదని వేద పండితులు సూచించడంతో ఆయన తిరుపతిలోనే సమీక్షలు నిర్వహించి వెనక్కి వెళ్లిపోయారు.