15
హైడ్రా కూల్చి వేటల పర్వం కొనసాగుతోంది. శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ విలేజీలోని అయ్యప్ప సొసైటీలో 684 గజాలలో అక్రమంగా నిర్మించిన భవనాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ శనివారం పరిశీలించారు. జీహెచ్సీ నోటీసులు, హైకోర్టు ఉత్తర్వులను పట్టించుకోకుండా.. సెల్లార్, గ్రౌండ్ఫ్లోర్తో పాటు 5 అంతస్తుల భవనాన్ని నిర్మించడంపై ఫిర్యాదులు అందాయి. దీంతో హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు. హైడ్రా, ముందస్తు, జీహెచ్సీ అధికారులతో కలసి అయ్యప్ప సొసైటీలోని వంద ఫీట్ల రోడ్డుకు ఆనుకుని ఉన్న కట్టను ఏవీ రంగనాథ్ శనివారం పరిశీలించారు. అక్కడిక’క్కడే జీహెచ్సీ చందాన’గ’ర్ సర్కిల్ అధికారులు ఇచ్చిన షోకాజ్ నోటీసులతో పాటు హైకోర్టు ఉత్తర్వులను రంగనాథ్ పరిశీలించారు.