Wednesday, April 16, 2025
Home » అల్లు అర్జున బెయిల్‌పై విచారణ పూర్తి – Sravya News

అల్లు అర్జున బెయిల్‌పై విచారణ పూర్తి – Sravya News

by News Watch
0 comment
అల్లు అర్జున బెయిల్‌పై విచారణ పూర్తి


అల్లు అర్జున్ బెయిల్: సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందిన ఘటనలో సినీ నటుడు అల్లు అర్జున్ దాఖలు చేసిన రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. అల్లు అర్జున తరపున నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఈ కేసులో ఇప్పటికే తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. సాధారణ బెయిల్‌ కోసం అల్లు అర్జున్‌ నాంపల్లి కోర్టును ఆశ్రయించగా నేడు విచారణ జరిగింది. అల్లు అర్జున్ బెయిల్‌ పిటిషన్‌పై జనవరి 3వ తేదీన కోర్టు తీర్పు వెలువరించనుంది. మరోవైపు డిసెంబర్4న జరిగిన ఘటనలో తమ వైఫల్యం ఏమి లేదని సంధ్య థియేటర్ యాజమాన్యం పోలీసులకు లీగల్ టీం ద్వారా వివరణ పంపింది. ప్రీమియర్‌ షోల నిర్వహణ కోసం థియేటర్‌ను మైత్రీ మూవీ మేకర్స్‌కు అప్పగించామని అందులో పేర్కొన్నారు. ఘటన జరిగిన రోజు భద్రత కోసం 60 మంది ప్రైవేట్ సిబ్బందిని నియమించుకున్నట్టు వివరించారు. అల్లు అర్జున రెగ్యులర్ బెయిల్‌ పిటిషన్‌పై కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠ రేపుతోంది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch