16
అసైన్డ్ భూముల సంగతి ఏంటి..
గతంలో రైతుబంధు పట్టా భూములకే వచ్చింది. దీంతో అసైన్డ్ భూములు ఉన్నవారు నష్టపోయారు. కౌలు రైతులకు ప్రయోజనం లేకుండా పోయింది. ములుగు, వరంగల్, మహబూబాబాద్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, మంచిర్యాల, మహబూబ్ నగర్ వంటి జిల్లాల్లో చాలా వరకు రైతులకు లాభం జరగలేదు. ఇవన్నీ గుర్తించిన ప్రస్తుత ప్రభుత్వం వారి గురించి కూడా ఆలోచిస్తున్నట్లు ఉంది. ఈ జిల్లాల ప్రజల రైతు భరోసా.. వడ్లకు బోనస్ బాగుందని.. ఇంకాస్త బోనస్ పెంచితే.. సాగు చేస్తే రైతులకు మరింత లాభం చేకూరుతుందని అభిప్రాయపడుతున్నారు.