Friday, October 18, 2024
Home » తెలుగు రాష్ట్రాల్లో వరుసగా ఆలయాలపై దాడులు.. అన్నమయ్య జిల్లాలోనూ ఆంజనేయస్వామి గుడి కూల్చివేత – News Watch

తెలుగు రాష్ట్రాల్లో వరుసగా ఆలయాలపై దాడులు.. అన్నమయ్య జిల్లాలోనూ ఆంజనేయస్వామి గుడి కూల్చివేత – News Watch

by News Watch
0 comment
తెలుగు రాష్ట్రాల్లో వరుసగా ఆలయాలపై దాడులు.. అన్నమయ్య జిల్లాలోనూ ఆంజనేయస్వామి గుడి కూల్చివేత


తెలుగు రాష్ట్రాల్లో ఆలయాల ధ్వంసం ఆందోళన కలిగిస్తోంది. మొన్నటికి మొన్న తెలంగాణలోని సికింద్రాబాద్ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంపై దాడి ఘటన జరగ్గా.. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం సింగాయిపల్లిలో పెద్దమ్మ తల్లి ఆవరణలో ఏర్పాటుచేసిన దేవతావిగ్రహాలను ఓ వ్యక్తి ధ్వంసం చేశాడు. తాజాగా.. ఆంధ్రప్రదేశ్ ములకలచెరువు వద్ద అభయాంజనేయ స్వామి ఆలయాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. మంగళవారం అర్ధరాత్రి వెలుగుచూసిన ఘటనపై ఆరెస్సెస్, బీజేపీ, వీహెచ్‌పీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కాగా, సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడిలో అమ్మవారి విగ్రహాన్ని కాలితో తన్ని ధ్వంసం చేసిన నిందితుల్లో ఒకడు సల్మాన్ సలీం ఠాకూర్.. విద్వేష ప్రసంగాలు వినడం.. ఇతర మతాల పట్ల విద్రోహ మనస్తత్వాన్ని ప్రదర్శించడం లాంటివి చేసేవాడని తేలింది. మహారాష్ట్రలోని ముంబ్రాకు చెందిన సల్మాన్.. బీటెక్ చేశాడు. జాకీర్ నాయక్ ప్రసంగాలు వింటూ ఇతర మతాలపై ద్వేషం పెంచుకున్నాడు. గత నెల హైదరాబాద్‌కు వచ్చిన సల్మాన్.. ముంబైలోనూ పలు విగ్రహాల ధ్వంసానికి గురైనట్లు పోలీసుల విచారణలో తేలింది.

కేటీఆర్ వెదవ.. రేవంత్ రెడ్డి హౌలే సీఎం.. తెలంగాణలోనూ మొదలైన బూతులు
భూమ్మీద అత్యంత అనారోగ్యకర ఆహార పదార్థాలు ఇవే..

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch