11
ఇటీవల భారీ వర్షాలతో.. ప్రస్తుతం కృష్ణా నది జలకళ సంతరించుకుంది. నదికి ఇరువైపులా పచ్చదనాన్ని పరచుకున్న నల్లమల అడవులు కనువిందు చేస్తున్నాయి. దీంతో కృష్ణా నదిలో సోమశిల నుంచి శ్రీశైలం వరకు లాంచీ ప్రయాణానికి తెలంగాణ పర్యాటక శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సోమశిల నుంచి శ్రీశైలం వరకు 90 కిలో మీటర్ల లాంచీ ప్రయాణం టూరిస్టులకు మధురానుభూతిని మిగలనుంది. కొల్లాపూర్ మండలం సోమశిల దగ్గర కృష్ణా నదిలో ఇప్పటికే మినీ లాంచీతో జాలీ ట్రిప్ ఉన్నారు. పెద్దలకు రూ.50, పిల్లలకు రూ.30 చొప్పున వసూలు చేస్తున్నారు.