10
మణుగూరు మండలంలోని గాంధీ బొమ్మ సెంటర్లో జడ్పీహెచ్ఎస్ గర్ల్స్ హైస్కూల్ వర్షాలకు స్కూల్ గదులు కురుస్తూ, పెచ్చులు ఊడి విద్యార్థులపై పడుతుండడంతో… విద్యార్థులు విద్యను అభ్యసించుడు ఏమోగానీ భయభ్రాంతులకు గురి అవుతున్నారు. స్కూల్ సమస్యలు తెలుసుకున్న సామాజిక కార్యకర్త కర్నెరవి మట్టపల్లి సాగర్ యాదవ్ సింగరేణి అధికారులు కలిసి ఈరోజు గర్ల్స్ హై స్కూల్ ను సందర్శించిన సింగరేణి అధికారులు సిఎస్ఆర్ నిధుల నుంచి 25 లక్షల రూపాయలు కేటాయిస్తూ స్కూల్ కు కావలసిన మౌలిక సదుపాయాలు కల్పనకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు కర్నె రవిని, మట్టపల్లి సాగర్ యాదవును విద్యార్థులు ఉపాధ్యాయులు అభినందించారు.