Wednesday, December 10, 2025
Home » రాష్ట్రంలో పరిస్థితులు, దాడులపై గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేసిన వైఎస్‌ జగన్‌ – News Watch

రాష్ట్రంలో పరిస్థితులు, దాడులపై గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేసిన వైఎస్‌ జగన్‌ – News Watch

by News Watch
0 comment
రాష్ట్రంలో పరిస్థితులు, దాడులపై గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేసిన వైఎస్‌ జగన్‌


రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కూటమి తరువాత పరిస్థితులు, వైసీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. గవర్నర్‌ అబ్ధుల్‌ నజీర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఆదివారం సాయంత్రం గవర్నర్‌ భవన్‌కు వెళ్లిన జగన్‌ కూలంకుషంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను గవర్నర్‌కు తెలియజేశారు. ఇప్పటి వరకు జరిగిన దాడుల్లో చనిపోయిన వైసీపీ కార్యకర్తల వివరాలు, జరిగిన ఆస్తుల నష్టం, ఇతర అంశాలకు సంబంధించిన వివరాలను గవర్నర్‌కు జగన్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా తెలియజేసినట్టు తెలిసింది. పుంగనూరులో ఎంపీ మిథున్‌రెడ్డిపై జరిగిన దాడి, మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటిపై జరిగిన దాడి వంటి అంశాలను జగన్ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో శాంతి, భద్రతలు క్షీణించిన ఈ సందర్భంగా జగన్ గవర్నర్‌కు వివరించారు. టీడీపీ అరాచకాలను అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కావాలనే సాగిస్తోందన్న విషయాన్ని వివరించారు. ప్రతిపక్షంలో నారా లోకేష్‌ చెప్పినట్టుగానే రెడ్‌బుక్‌లో రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు, కక్ష రాజకీయాలకు ఉపయోగిస్తున్నారంటూ జగన్ గవర్నర్‌కు అందుబాటులో ఉంది. రాష్ట్రంలో క్షీణించిన శాంతి, భద్రతలు, జరిగిన హత్యకాండకు సంబంధించిన విషయాలను క్షుణ్ణంగా జగన్ గవర్నర్‌కు వివరించారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేయాలని గవర్నర్‌ను ఈ సందర్భంగా జగన్ కోరినట్లు తెలిసింది.

గవర్నర్‌తో జగన్‌ సమావేశం సుమారు 45 నిమిషాలపాటు సాగింది. జగన్ ఫిర్యాదు చేసిన అంశాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలతో కూడిన ఆధారాలను ఆయన సమర్పించారు. గడిచిన 45 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా హత్యాకాండతో వైసీపీ కార్యకర్తలను భయబ్రాంతులకు గురిచేసే ప్రయత్నం టీడీపీ చేస్తోందని ఆయన ఈ సందర్భంగా గవర్నర్‌కు తెలియజేశారు. వినుకొండలో రషీద్ ఈ సందర్భంగా జగన్ ప్రత్యేకంగా ప్రస్తావించడంతోపాటు దానికి సంబంధించిన వీడియోను గవర్నర్‌కు చూపించారు. శాంతి, భద్రత అంశంపై గవర్నర్‌ జోక్యం చేసుకోవాలని ఈ సందర్భంగా జగన్‌తో చర్చించారు. ఇప్పటికీ హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో గవర్నర్ చర్యలు తీసుకోవాలని ఆయన విన్నవించారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch