రామచంద్రపురం నియోజకవర్గంలో టీడీపీ కార్యాలయంలో ఇవాళ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 20వ తారీఖున రామచంద్రపురం వి ఎస్ ఎం కాలేజీలో జరగబోవు మెగా జాబ్ మేళ ను నిరుద్యోగ యువత అందరూ వినియోగించుకోవాలని కోరారు. ఇంటర్, డిగ్రీ, పీజీ , డిప్లొమా, బీటెక్ , ఎంబీఏ పూర్తిచేసిన నిరుద్యోగులు జాబ్ మేళాలో పాల్గొని వివిధ కంపెనీలు ఈ మేళాలో పాల్గొంటున్నయని తెలిపారు. సుమారు రెండు వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. కావున అంబేద్కర్ కోనసీమ జిల్లా నిరుద్యోగ యువత అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.