Monday, March 23, 2026
Home » ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ జులై 12 దాకా పొడిగింపు – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ జులై 12 దాకా పొడిగింపు – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

by News Watch
0 comment
 ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ జులై 12 దాకా పొడిగింపు - తాజా తెలుగు వార్తలు |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



న్యూఢిల్లీ: ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను రౌస్ అవెన్యూ కోర్టు జులై 12 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. ముఖ్యమంత్రికి జ్యుడీషియల్ కస్టడీని కోరుతూ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) చేసిన పిటిషన్‌పై కోర్టు ఇంతకుముందు ఉత్తర్వులను రిజర్వ్ చేసిన తర్వాత ఇది జరిగింది. జ్యుడీషియల్ కస్టడీ కోరుతూ రౌస్ అవెన్యూ కోర్టుకు ఇచ్చిన దరఖాస్తులో, అరవింద్ కేజ్రీవాల్ దర్యాప్తుకు సహకరించడం లేదని, ఉద్దేశపూర్వకంగా ప్రశ్నలకు నేరుగా సమాధానాలు ఇవ్వకుండా తప్పించుకుంటున్నారని సీబీఐ ప్రకటించింది.

సీబీఐ కోర్టులో ఏం చెప్పింది?

“దర్యాప్తును ప్రభావితం చేయగల ప్రముఖ రాజకీయ నాయకుడు కేజ్రీవాల్. దర్యాప్తునకు సీఎం సహకరించడం లేదు మరియు ప్రశ్నలకు సరైన మరియు సూటిగా సమాధానాలు ఇవ్వలేదు.” అని సీబీఐ చెప్పింది. ఎక్సైజ్ కుంభకోణానికి సంబంధించిన అవినీతి కేసులో సిబిఐ అరెస్టు చేసిన తరువాత ఢిల్లీ కోర్టు బుధవారం ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను మూడు రోజుల పాటు సిబిఐ కస్టడీకి పంపింది. ఢిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీకి సంబంధించి కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. మార్చి 21న, ఇప్పుడు రద్దయిన పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్ డైరెక్టరేట్ (ED) ఆయనను అరెస్టు చేసింది. ఆయనకు ట్రయల్ కోర్టు బెయిల్ ఇవ్వడంతో ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch