Wednesday, March 18, 2026
Home » ఎర్రచందనం అక్రమ రవాణాపై ఉక్కు పాదం మోపుత : పవన్‌ కల్యాణ్‌ – Sravya News

ఎర్రచందనం అక్రమ రవాణాపై ఉక్కు పాదం మోపుత : పవన్‌ కల్యాణ్‌ – Sravya News

by News Watch
0 comment
ఎర్రచందనం అక్రమ రవాణాపై ఉక్కు పాదం మోపుత : పవన్‌ కల్యాణ్‌


రాష్ట్రంలో ఎర్రచందనం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతానని జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ స్పష్టం చేశారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, తాగునీరు అందించడంపై దృష్టి సారిస్తానన్నారు. తాను నిర్వర్తించబోయే శాఖల తన మనసుకు, జనసేన సిద్ధాంతాలకు దగ్గరగా ఉందని పవన్ కల్యాణ్. ప్రజలకు మేలైన సేవలు అందించే భాగ్యం తనకు కలిగిందన్న పవన్‌.. ఎర్ర చందనం, సంపద అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతానని స్పష్టం చేశారు. అడవులు వినాశనానికి జైలు శిక్ష విధించినట్లయితే ఏంటి వారైనా వెళ్లాల్సిందేనన్నారు. సామాజిక వనాలు పెంచాల్సిన అవసరం ఉందన్న పవన్.. ఆ దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. పవన్ కల్యాణ్‌ ఉపముఖ్యమంత్రితోపాటు పర్యావరణ, గ్రామీణాభివృద్ధి వంటి శాఖలకు మంత్రిగా వ్యవహరించనున్న విషయం తెలిసిందే. మంత్రిగాలు బాధ్యత స్వీకరించిన అనంతరం పవన్‌ కల్యాణ్‌ తొలిసారిగా ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎర్ర చందనం యథేచ్ఛగా అక్రమ రవాణా సాగుతోందని, ప్రత్యేకంగా దృష్టి సారించనున్నట్టు పవన్‌ కల్యాణ్‌ ఏర్పాటు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch