Wednesday, April 9, 2025
Home » మర్పల్లి ప్రభుత్వ వైద్యుడి నిర్వాకం.. ఫోన్ ఒక చేత వైద్యం ఇంకో చేత్తో..

మర్పల్లి ప్రభుత్వ వైద్యుడి నిర్వాకం.. ఫోన్ ఒక చేత వైద్యం ఇంకో చేత్తో..

0 comment

వికారాబాద్ జిల్లా మర్పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో పేరుకే 30 పడకల ఆసుపత్రి డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఆసుపత్రికి వచ్చే రోగులకు చేదు అనుభవం ఎదురవుతుంది. దూర ప్రాంతాల నుండి వచ్చే రోగులకు వైద్యం అందించాల్సిన వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రోగుల సహనాన్ని పరీక్షిస్తున్నారు. మర్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డ్యూటీ డాక్టర్ బుదవారం రాత్రి సమయంలో వచ్చిన పేషెంట్లు పక్కన పెట్టుకొని ఫోన్లో ఏవో తన పర్సనల్ మ్యాటర్ మాట్లాడుకుంటూ.. మరో వైపు రోగికి ఏమైంది అని వివరాలు అడిగి తెలుసుకుంటూ వైద్యం చేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ వైద్య ఉన్నతాధికారులు స్పందించి రోగుల పట్ల నిర్లక్ష్య చేసే డాక్టర్ల పైన కఠినంగా చర్యలు తీసుకోవాలని ఆసుపత్రికి వస్తున్న రోగులు కోరుతున్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch